- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనం ఈనెల 13న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రారంభిస్తారని సర్పంచ్ కె మాధవరావు తెలిపారు. ప్రారంభోత్సవానికి గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
- Advertisement -



