ములుగు నియోజకవర్గ నిధులపై స్పష్టతనివ్వండి

Clarify on funds of Mulugu Constituency– ఎమ్మెల్యే సీతక్క కేసులో హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ములుగు నియోజకవర్గానికి అభివృద్ధి నిధుల మంజూరుపై స్పష్టత నివ్వాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తన నియోజకవర్గానికి రూ.2.6 కోట్లను మంజూరు చేస్తూ ఈ ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనీ, అయితే నిధుల్ని విడుదల చేయలేదని పేర్కొంటూ ములుగు ఎమ్మెల్యే డీఏ సీతక్క హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ చిల్లకూరు సుమలత శుక్రవారం విచారించారు. జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్‌ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారనీ, నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అంద కుండా చేస్తున్నారని ఆమె తరపు లాయర్లు వాదించారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల మంజూరుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది.

Spread the love