తక్కువ దూరానికి పల్లెవెలుగు ఎక్కండి

తక్కువ దూరానికి
పల్లెవెలుగు ఎక్కండి– మహిళా ప్రయాణీకులకు టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణీకులు తక్కువ దూరానికి పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించాల ని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. తక్కువ దూరానికి కూడా ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఎక్కడం వల్ల దూరప్రాంత ప్రయాణీకు లకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నదని శనివారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగేందుకు ప్రయాణీకులు సహకరించాలని కోరారు. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బం దిపై ఒత్తిడి తెస్తున్నారనీ, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని స్పష్టంచేశారు. దూర ప్రాంత ప్రయాణీకులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

Spread the love