ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు. నేటి మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు. ఉరుస్-ఎ-షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు  గిలాఫ్ ఇ చాదర్‌ను ఆయన సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.

Spread the love