గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని సీఎం గవర్నర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ను రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను మంత్రులు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. సీఎంతో పాటు మంత్రులు గవర్నర్‌తో కాసేపు ముచ్చటించారు.

Spread the love