నేడు వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ రానున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 1.30 గంటలకు వరంగల్ చేరుకోనున్నారు. అక్కడ టెక్స్‌టైల్స్ పార్క్, మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి సందర్శన, మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

 

Spread the love