పాఠశాల సంపులో త్రాచుపాము కలకలం..

నవతెలంగాణ -దంతాలపల్లి
ప్రభుత్వ పాఠశాలలో త్రాచుపాము కలకలం రేపిన ఘటన మండలంలోని కుమ్మరి కుంట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం చోటు చేసుకుంది. దాదాపు ఆ పాఠశాలలో 120 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ప్రమాదం తప్పింది. పాఠశాల ఆవరణలోని నీటి సంపులో పెద్ద త్రాచుపాము పక్కనే ఉన్న వ్యవసాయ రైతుకి కనిపించింది. ఈ క్రమంలో నవతెలంగాణ ప్రతినిధి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్నకి ఫోన్ సమాచారంతో చెప్పడంతో గత సంవత్సరం ఇదే సమయంలో అలాంటి త్రాచుపామే అందులో పడి చాలా రోజులు ఉండి చనిపోయిందని అన్నారు. పాఠశాలలో త్రాచుపాము సంపులో కనిపించడంతో గ్రామస్తులు పాఠశాల ఉంటే తమ పిల్లలకు ఏమవునొనని భయాందోళనకు గురవుతున్నారు.

Spread the love