గ్రూప్-4 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

నవతెలంగాణ కంటేశ్వర్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా శనివారం ఉదయం జరిగిన గ్రూప్-4 మొదటి సెషన్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్ భవన్), కాకతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాలను తెరిచారా? లేదా? అన్నది నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం రెండవ సెషన్ లో జరిగే పేపర్-2 పరీక్షను కూడా ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, టీ ఎస్ పీ ఎస్ సీ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు సుశీల్ కుమార్, సందీప్ కుమార్ లకు కలెక్టర్ సూచించారు. కాగా, గ్రూప్-4 పేపర్-1 పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు.
Spread the love