సివిల్స్‌ ర్యాంకర్‌ శ్రీసాయిఆశ్రిత్‌కు సన్మానించిన పోలీసు కమిషనర్‌

నవతెలంగాణ-హనుమకొండ
సివిల్స్‌పరీక్షల్లో 40వ ర్యాంకు సాధించిన శాఖ మూరి శ్రీసాయిఆశ్రిత్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం అభినందించారు. సివిల్స్‌ పరీక్షలో ర్యాంక్‌ సాధించిన శ్రీసాయిఆశ్రిత్‌ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ను మర్యా దపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ సాయిఆశ్రిత్‌కు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శాలువా కప్పి పుష్పాగుచ్ఛంఅందించి అభినందించారు. అనం తరం శ్రీసాయి ఆశ్రిత్‌ సివిల్స్‌ పరీక్షలకు చదివిన తీ రుతెన్నుల పోలీసుకమిషనర్‌ అడిగి తెలుసుకోవడం తో పాటు భవిష్యత్తులో నిరుపేదలకు పక్షాన నిలిచి వారి అభ్యున్నతి కోసం విధినిర్వహణలో ముందుకు సాగాలని, చిరుప్రాయంలోనే మొదటి ప్రయత్నంలో సివిల్స్‌ సాధించడం అభినందనీయమని, అలాగే నేటి యువతకు స్ఫూర్తిగానిలుస్తూ సివిల్స్‌ర్యాంకులు సా ధించిన జయసింహరెడ్డి, పత్తిపాక సాయికిరణ్‌, కొట్టే రుత్విక్‌సాయి, మందఅపూర్వ, కొయ్యడ ప్రవీణ్‌కు మార్‌లకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అభినందనలు తెలపడంతో పాటు, తమ పిల్లలను సివిల్స్‌ పరీక్షల్లో ర్యాంకు సాధించడంలో కృషి చేసిన తల్లిదండ్రులకు పోలీస్‌ కమిషనర్‌ అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసిపి శ్రీనివాస్‌, శ్రీసాయి ఆ శ్రిక్‌ తండ్రి అమర్‌ పాల్గొన్నారు.

Spread the love