– పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-మధిర
ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని సిపిఎం పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి పాలడుగు భాస్కర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని రాయపట్నం గ్రామంలోని జోనల్ సమావేశంలో వారు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పిందని చెప్పిందొకటి చేసేది మరొకటి.. ప్రయివేటు వ్యక్తులకు గవర్నమెంట్ స్థలాలను విచ్చలవిడిగా అమ్మేసింది.. ప్రభుత్వం అన్ని స్థలాలను కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తంగా అమ్మేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్య గాని, ఇళ్ల స్థలాల సమస్యలు గానీ, రేషన్ కార్డులు, పెన్షన్ సమస్యలు అన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. లేని పరిస్థితుల్లో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం జిల్లా నాయకులు శీల నరసింహారావు, మధిర మండల కార్యదర్శి మందా సైదులు, మధిర మండల నాయకులు మద్దాల ప్రభాకర్, వడ్రానపు మధు, సిపిఎం మండల నాయకురాలు చేగొండి వెంకాయమ్మ, సంపసాల గోపాలరావు, రాయపట్నం శాఖ కార్యదర్శి చేగొండి వీరయ్య, గోపి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.