– టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కమ్యూనిస్టులు తమకు మిత్రులేననీ, శత్రువులు కాదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్ చెప్పారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాడి, పేదల పక్షానా నిలబడిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంద న్నారు. అందుకే కమ్యూనిస్టులంటే తమకు గౌరవముందని చెప్పారు. వారు చట్టసభల్లో ఉండాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతిóతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.
సీట్లిస్తామని సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులను మోసం చేశారని విమర్శించారు. పదేండ్లు ఎమ్మెల్యే లుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు అరాచకంగా సంపాదించారని ఆరోపించారు. 54.55 శాతం ఉన్న బీసీలకు 23 సీట్లు ఇచ్చి సీఎం కేసీఆర్ బీసీలకు అన్యాయం చేశారని తెలిపారు.