– తెలంగాణు ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నరు: ఎన్.రామచంద్రరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశద్రోహులకు ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీ మారిందని మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ఆరోపించారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ విడుదల చేసిన దాంట్లో ఒక్క చార్జీ లేదు..షీటూ లేదు అని విమర్శించారు. తమది ఆర్ఎస్ఎస్ భావజాలం అని సగర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ భావజాలమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక విధానాలు తీసుకున్నదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చే అలవాటు కాంగ్రెస్దనీ, అనేకసార్లు సవరించిందని గుర్తు చేశారు.ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను హరించిందని కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాహుల్గాంధీ తెలంగాణలో చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదనీ, ప్రజలు కొట్లాడి సాధించికున్నారని తెలిపారు. తెలంగాణ ముందే ఇచ్చిఉంటే ఇన్ని బలిదానాలు జరిగేవి కావన్నారు. తాము ఇప్పటివరకూ రిజర్వేషన్లు పెంచాం తప్ప తీసెయ్యలేదని చెప్పారు.