కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

– పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సతీమణి మాధురి రెడ్డి
– రఘురామిరెడ్డి విజయం ఖాయం వైరా నియోజకవర్గ ఇన్‌చార్జీ విజయబాయి
నవతెలంగాణ-బోనకల్‌
ఖమ్మం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సతీమణి మాధురి రెడ్డి మహిళలను కోరారు. మండల పరిధిలోని ముష్టికుంట్ల, బోనకల్‌ గ్రామాలలో బుధవారం వైరా నియోజకవర్గ ఇన్చార్జి విజయభాయితో కలిసి మాధురి రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి రఘురామరెడ్డికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మహిళలతో ప్రత్యేక నిర్వహించిన సమావేశాలలో మాధురి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ విజయం సాధించబోతుందని, ఖమ్మం అభ్యర్థి రఘురామరెడ్డి మెజార్టీ ఎంత అనేది తేలవలసి ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిందన్నారు. ప్రతి మహిళ ఆలోచించి రఘురామిరెడ్డికే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా మహిళా శక్తిని నిరూపించాలని కోరారు.
రఘురామిరెడ్డి విజయం ఖాయం: విజయబాయి
కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయం ఖాయమని విజయబాయి అన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ అభ్యర్థికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది అన్నారు. రఘురామిరెడ్డి విజయంతోనే జిల్లా అభివద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను ఓడించడానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని విమర్శించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు కోటా రాంబాబు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, కాంగ్రెస్‌ నాయకులు భూక్య సైదా నాయక్‌, బండి వెంకటేశ్వర్లు, పిల్లలు మర్రి నాగేశ్వరరావు, బంధం నాగేశ్వరరావు, చిట్టా సత్యనారాయణ రెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు తెల్లాకుల శ్రీనివాసరావు, దొప్ప కొరివి వీరభద్రం, కందికొండ శ్రీనివాసరావు, పిల్లలమర్రి వెంకట అప్పారావు, షేక్‌ నజీర్‌, భూక్య జాలు, ఉప్పెర శ్రీను, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు రమేష్‌, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love