నలంద పాఠశాల వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్

నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని నలంద స్కూల్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంగళవారం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ లో పక్కాగా గెలుస్తున్న పట్టణ ప్రజలు చూపిస్తున్న అభిమానం చూస్తే నమ్మకం కలిగింది. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా అని తెలియజేశారు. మూడో తారీఖు నాడు దండుపాలెం దోపిడి ముఠాతో రాష్ట్రం విముక్తి కాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. ఓటమి భయంతో మతం మూసుగులో కుట్ర చేయాలని చూస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలారా ఈ రెండు రోజులు మీరు సమన్వయంతో మెదలండి. ప్రతి ఒక్కరితో ఓటు వేయించే బాధ్యత తీసుకోండి. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు అందిస్తాం దానితోపాటు కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం రాష్ట్రంలో కాంగ్రెస్ గాలివీస్తుంది దీంట్లో కెసిఆర్ కుటుంబం కొట్టుకపోవడం ఖాయం అని తెలిపారు. డబ్బు మద్యం వెదజల్లి ఎన్నికల్లో ఓట్లు కొని అక్రమంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్‌ బోల్తా కొట్టడం పక్క రెండు రోజులు మద్యానికి డబ్బులకు లొంగితే మన రెండుతరాల పిల్లల భవిష్యత్తు అన్యకాంతం అవుతుంది. ఎలాంటి పొరపాటు చేయకుండా కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించి మన అభివృద్ధి మనం చేసుకుందాం. రాష్ట్ర మొత్తానికి తెలుసు షబ్బీర్ అలీ అంటే అభివృద్ధి అందరివాడని తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్  అధికారంలోకి వస్తుంది సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాలకు నేను గ్యారెంటీ అని తెలియజేశారు.
Spread the love