కాంగ్రేస్ ది కుటుంబ పాలనా కేసీఆర్ ది కాదు

– రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు
– అది శ్రీనివాస్ ఆకలితో ఉన్న సింహం
– బీఆరెస్ సమ్మేళనంలో ప్రణాళిక రాష్ట్ర ఉప అధ్యక్షుడు వినోద్ కుమార్
నవతెలంగాణ-చందుర్తి : కాంగ్రెస్ ది కుటుంబ పాలన కేసీఆర్ ది కాదు అని బోయినపల్లి రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు ఇంద్ర గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అంటూ వారిది కుటుంబ పాలన కేసీఆర్ ది కుటుంబ పాలన కాదని ఎద్దేవా చేశారు.కర్ణాటక రాష్ట్రంలో ఐదు గంటల కరంటు ఇస్తున్నారు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం లేదు అని విమర్శించారు.తెలంగాణ లో కాంగ్రేస్ అధికారం లోకి వస్తే కర్ణాటక లో మోసం చేసినట్లుగా ఇక్కడ చేస్తారని మాట్లాడారు.అదేవిదంగా వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయారు మీ మోసపూరిత వారంటీ లేని గ్యారంటీలు ఇస్తూ ప్రజలను మభ్య పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ చూస్తుందని అన్నారు.
అది శ్రీనివాస్ ఆకలితో ఉన్న సింహం
లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ అది శ్రీనివాస్ ఆకలితో ఉన్న సింహం అని విమర్శించారు ఆకలితోనే ఉన్నవాళ్లు కావాలనా ప్రజా సేవ చేసేవారు కావాలనా అంటూ పరోక్షంగా ఆది శ్రీనివాస్ పై విమర్శలు గుప్పించారు గత నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయి ఆకలితో ఉన్న వాళ్ళకు ఓటు వేస్తే వేములవాడ నియోజకవర్గం దోచుకుంటారని అన్నారు. కేసులు పెట్టడం తమ సంస్కృతి కాదు ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకోవడం బాధ్యతని ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ పథకాల తో బి ఆర్ఎస్ బలగంతో తమ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా అన్నారు. గెలిస్తే ఈ ప్రాంత ప్రజల కు ఏ సేవ చేయాలను తెలుసని అన్నారు.

Spread the love