ప్రచారంలో  దూసుకుపోతున్న కాంగ్రెస్ నాయకులు

– ఆరు గ్యారంటీలపై విస్తృతంగా అవగాహన
నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, ఎంపిపి మలహల్ రావు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో  దూసుకుపోతున్నారు. ఏ పల్లె, వాడకు వెళ్లిన ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. మంథని ఎమ్మెల్యేగా శ్రీదర్ బాబును గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజల నుంచి విశేష ఆదరణ రావడంతో ఇక మంథని ఎమ్మెల్యేగా శ్రీదర్ బాబు విజయం తథ్యమే కానీ భారీ మెజార్టీ కోసమే తాము పరితపిస్తుమన్నారు.పల్లెల్లో దుద్దిళ్లను గెలిపించాలని ఎక్కడికెళ్లినా జై కాంగ్రెస్ జై  శ్రీధర్ బాబు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. శనివారం మండలంలోని పెద్దతూoడ్ల, రుద్రారం, తాడిచెర్ల, పాత రుద్రారం  గ్రామల్లో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలందరికీ వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్దిoచారు.ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధే కాంగ్రెస్ ద్యేయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు, కౌలురైతులు తదితరులకు ఆరు గ్యారెంటీలతో పాటు పలు డిక్లరేషన్లను అమలు చేయడం పక్కాగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు భోగే మల్లయ్య, చిగురు సదానందం పాల్గొన్నారు.
Spread the love