కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పంజాల ప్రభాకర్ బీఆర్ఎస్ లో చేరిక

 – అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు- గాదరి కిషోర్ కుమార్.
నవతెలంగాణ- తుంగతుర్తి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది బీఆర్ఎస్ లో చేరుతున్నారని తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పంజాల ప్రభాకర్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా గులాబీ కండువా కప్పి సాధనంగా ఆహ్వానించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు గుండగాని శ్రీనివాస్, కంచర్ల కుశలవ రెడ్డి, దుర్గయ్య, శ్రీహరి, కట్ల చంద్రయ్య, యాదగిరి, ప్రవీణ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love