జన జాతరకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు

నవతెలంగాణ – పెద్దవంగర

తుక్కుగూడ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన తెలంగాణ జన జాతర భారీ బహిరంగ సభకు మండలం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. సభకు వెళ్ళే వాహనాలకు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. సభకు తరలి వెళ్ళిన వారిలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, సీనియర్ నాయకులు బానోత్ వెంకన్న, సంకేపల్లి రవీందర్ రెడ్డి, ఉట్ల వీరా రెడ్డి, యూత్ నాయకులు మహేష్, సతీష్ తదితరులు ఉన్నారు.
Spread the love