కాంగ్రెస్ జన గర్జన సభను జయప్రదం చేయండి..

నవతెలంగాణ-బయ్యారం
ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయన అనుచర బృందం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా జూలై 2 న ఆదివారం ఖమ్మంలో నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి ఎన్నికల కో-ఆర్డినేటర్, మాజీ మండల అధ్యక్షుడు వడ్లమూడి సురేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని కోత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి రాకను స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా ఖమ్మం సభకు హాజరుకానున్న నేపథ్యంలో ఈ సభకు అంచనాకు మించి జనం వచ్చే అవకాశం ఉన్నందున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినా అనుకున్నది జరగలేదని, నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారని ఆవదేన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతోని అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు తీగల వెంకటేశ్వర్లు, జార సాగర్, జంపన్న, ఈసం భద్రమ్మ, రాంమ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Spread the love