మాధవపల్లి గ్రామంలో సీసీరోడ్లు నిర్మాణ పనులు ప్రారంభం

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని మాధవపల్లీ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ రాధబలరాం, జడ్పీటీసీ శంకర్ నాయక్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మమ్మాయి సంజీవ్ యాదవ్లతో కలసి స్థానిక సర్పంచ్ లక్ష్మీబాయి మహిపల్ రావు కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఏంసి మాజీ ఛైర్మన్ సత్యం, ఏఏంసి వైస్ చెర్మెన్ రెడ్డిరాజు, ఎంపిటిసి సభ్యులు బాలరాజు, ఉప సర్పంచ్ నారాయణ రావు, బిఆర్ ఎస్హొ అధ్యక్షుడు రాజేందర్ రావు, నాయకులు ప్రభాకర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love