– సమ్మెను ప్రారంభించిన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ- కంటేశ్వర్
సమ్మెలోకి కాంట్రాక్టు ఏఎన్ఎంలు సమ్మెను సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ సమ్మెను బుధవాారం ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి సెకండ్ ఏఎన్ఎంలు గ్రామాల్లో పనిచేస్తున్న నేటికీ పర్మనెంట్ చేయకపోవడం చాలా దుర్మార్గం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి నెలలో అన్ని రకాల పనులు చేయిస్తూ కేసీఆర్ కిట్టు, ఆన్లైన్లో, ఐ హెచ్ ఐ పి, డబ్ల్యూ హెచ్ సి అబాకర్స్, 32 రికార్డులను ఆన్లైన్ చేస్తూ 24 గంటల పని చేస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన గ్రామస్థాయిలో అనేక ఇబ్బందులను ఓర్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తెస్తూ కరోనా కష్టకాలంలో కూడా రెండు సంవత్సరాలు కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేసిన ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమని ఆమె అన్నారు వారి యొక్క శ్రమను గుర్తించకుండా వారిని పర్మినెంట్ చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు గ్రామాల్లో వ్యాక్సినేషన్, ఎన్ సి డి, పి ఎన్ సి ల విసిట్, టిబి కేసులు, లెప్రసీ ప్రతి నెల 100% కావాలని పై అధికారులు ఏఎన్ఎం పై ఒత్తిడి చేస్తూ నారు. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు.తక్షణమే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంం లను పర్మినెంట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పండగ వారంతా సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు. పుష్ప కవిత ధన స్వర్ణ సరోజ లలిత విక్టోరియా, సుశీల, ఇంద్ర లక్ష్మీ గంగామణి విజయ రేణుక జ్యోతి అనురాధ తదితరులు పాల్గొన్నారు.