నవతెలంగాణ – హైదరాబాద్
గత రెండ్రోజులుగా తమిళనాడుతో పాటు ఏపీ తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మిగ్జామ్ నెల్లూరు జిల్లాలో తీరం చేరింది! జిల్లాలోని బిట్రగుంట, కావలి వద్ద ఇది భూభాగంపైకి ప్రవేశించింది. తీరం దాటిన అనంతరం మిగ్జామ్ తుపాను బలహీనపడినట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇది ఏపీ భూభాగంపై వాయవ్య దిశలో పయనిస్తూ క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో నేడు ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.