గాలి దుమారం.. లేచిన ఇంటి రేకులు…తప్పిన ప్రమాదం

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
శనివారం రాత్రి గాడుపు, దుమారం లేవడంతో హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామనికి చెందిన పొన్నబోయిన లత ఇంటి పై కప్పు రేకులు ఒకసారిగా వచ్చిన గాలికి లేచిపోయాయి. అప్రమత్తమైన లత తన ఇద్దరు పిల్లలను బయటకు తీసుకొని వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు ధ్వంసం అయ్యాయి. ఇంటి పై కప్పు లేచి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు ఇతర సమగ్ర పూర్తిగా దెబ్బతిన్నాయి. పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లత వేడుకుంటుంది.

Spread the love