అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం

– ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట: బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాఘవపట్నం సర్పంచ్ దాబ్బాగట్ల లలిత ములుగు జిల్లా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాఘవపట్నం గ్రామంలో సర్పంచ్ దెబ్బగట్ల లలిత శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తూ మేనిఫెస్టో వల్ల అన్ని వర్గాల పేదలకు ఏ విధంగా వందుతున్నాయో చూసి అభివృద్ధి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అవుతుందని అన్నారు. అనంతరం రాఘవపట్నం  సర్పంచ్ లలిత  మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి ప్రసారం చేస్తామని బడే నాగజ్యోతి కి రాఘవపట్నం నుండి భారీ మెజార్టీ వచ్చే విధముగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి జడ్పిటిసి తుమ్మల హరిబాబు మండల అధ్యక్షులు సూరపునేని సాయికుమార్ గోవిందరావుపేట రైతు బందు కోఆర్డినేటర్ పిన్నింటి మధుసూదన్ రెడ్డి కంఠం నాగేశ్వరరావు ఫక్రుద్దీన్ నగేష్ చంద్రయ్య తదితరులు ఉన్నారు.
Spread the love