రెడ్డిపేటలో ఆటో డ్రైవర్ల ధర్నా

నవతెలంగాణ – రామారెడ్డి: మండలంలోని రెడ్డి పేటలో బుధవారం ఆటో డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బస్సులు, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచి పరిణామమైన, పొద్దస్తమానం ఆటోను నడిపిస్తేనే కుటుంబ జీవనం గడుస్తుందని, ప్రయాణికులు లేక జీవనం గడపడమే గగనంగా మారిందని, నెల నెల కట్టే ఈఎంఐలు కట్టె పరిస్థితి లేదని, ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు జి స్వామి గౌడ్, సాయిరాం గౌడ్, రమేష్, రాజు, జావిద్, రాంచందర్, బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love