క్వార్ట‌ర్ ఫైన‌ల్లో భార‌త మ‌హిళ‌ల బ్యాడ్మింట్ జ‌ట్టుకు నిరాశ‌

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడ‌ల్లో భార‌త మ‌హిళ‌ల బ్యాడ్మింట్ జ‌ట్టు నిరాశ‌ప‌రిచింది. పీవీ సింధు నేతృత్వంలో ఆ బృందం పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్లో థాయిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు దారుణంగా ఓడిపోయింది. శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా 0-3 తేడాతో థాయిలాండ్ చేతిలో ఓట‌మి పాలైంది. బ‌ల‌మైన థాయ్ జ‌ట్టు ముందు ఇండియా మ‌హిళా ష‌ట్ల‌ర్లు నిల‌వ‌లేక‌పోయారు. థాయ్ జ‌ట్టులో మాజీ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ర‌చ‌నోక్ ఇంట‌న‌న్, వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 12 ప్లేయ‌ర్ పోర్న్‌పావి చోచువాంగ్‌, వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 17 సుప‌నిదా క‌టేతాంగ్‌లు ఉన్నారు.

Spread the love