నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభాస్ ఫ్యాన్స్ సహా ఆడియెన్స్ అంతా సలార్ ఫీవర్లో మునిగిపోరు. కానీ రిలీజ్కు రెండు వారాల ముందు చావు కబురు చల్లగా అన్న రీతిలో హోంబలే సంస్థ పోస్ట్ పోన్ అంటూ ప్రభాస్ ఆశలపై నీళ్లుజల్లింది. ఇక అలా పోస్ట్ పోన్ అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చిందో లేదో.. నవంబర్లో రిలీజ్ అని, డిసెంబర్లో రిలీజ్ అని కొత్త డేట్లు పుట్టుకొచ్చాయి. మరీ ముఖ్యంగా డిసెంబర్ 22న సినిమా పక్కా వస్తుందన్న వార్త సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. కాగా తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన ఇచ్చేశారు. వారం నుంచి వస్తున్న రూమర్స్నే నిజం చేస్తూ డిసెంబర్ 22వ డేట్ను లాక్ చేసుకన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పవర్ ఫుల్ పోస్టర్ను కూడా దింపారు. చేతిలో పదునైన కత్తి పట్టుకుని ఒళ్లంతా రక్తంతో నిండిన ప్రభాస్ పోస్టర్ను రిలీజ్ చేసి ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.