నవతెలంగాణ – జక్రాన్ పల్లి: మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన గుద్దేటి లింగవ్వకు 21,000 రూపాయలు, పుప్పాల నర్సుకు 18,000 రూపాయలు ఎం. నవ్యకు 14,500 రూపాయలు మంజూరు అయ్యాయి. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను జక్రాన్ పల్లి మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో మండల ఎంపీపీ కుంచల విమల రాజు అధ్యక్షతన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుంచాలా విమల రాజు, జక్రాన్ పల్లి మండల కో ఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, చింతలూరు ఉప సర్పంచ్ జలంధర్ ,తదితరులు పాల్గొన్నారు.