వృద్ధులకు ఆహార పొట్లాల పంపిణీ

నవతెలంగాణ- రాజంపేట్
మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు పోలీస్ కృష్ణ ప్రసాద్  జన్మదినం సందర్భంగా ఆదివారం కామారెడ్డి రైల్వే స్టేషన్ లో ఆహారం పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో పోలీస్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తన వంతుగా మధ్యాహ్నం 50 మంది వృద్ధులకు, వికలాంగులకు భోజనం పంపిణీ చేయడం, అలాగే తన పేరు మీద ఆర్మూర్ పట్టణంలో సేవ్ ఫౌండేషన్ ద్వారా 50 మందికి, మీసాల రవికుమార్ సహకారంతో ఆహారం పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. కార్యక్రమంలో బాలాజీ, కొమ్ము రవి, రిషి, రాహుల్, మధు తదితరులు పాల్గొన్నారు.
Spread the love