విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు పంపిణీ

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన కుమారుడు కోడలు రామకృష్ణారెడ్డి, తేజశ్రీ దంపతులు గ్రామంలోని హరిజనవాడ కాలనీలో ఉన్న ప్రైమరీ పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయశ్రీ, ఉమా, స్వప్న, చేపూరి రాజు, పైతరి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love