క్షత్రియ సేవాసమితి సౌజన్యంతో బస్ స్టొండ్ కు వాటర్ కూలర్ వితరణ

నవతెలంగాణ – అశ్వారావుపేట
క్షత్రియ సేవాసమితి సౌజన్యంతో బాధ్యులు కునాదరాజు సోమరాజు – గంగాభవాని  దంపతులు సహాకారంతో బస్టాండ్ కు వాటర్ కూలర్ ను వితరణ గా అందజేసారు. ఈ కూలర్ ను సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి గురువారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి ప్రతిరోజు 10 మినరల్ వాటర్ క్యాన్ లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్,సునీత లు పాల్గొన్నారు.
Spread the love