- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలోని పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలను,జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి మంగళవారం సందర్శించారు. పిఎంశ్రీ పాఠశాల పర్యవేక్షణలో భాగంగా, విద్యార్థుల యొక్క ప్రతి తరగతి యొక్క విద్యార్థుల సామర్ధ్యాలను, పదవ తరగతి విద్యార్థుల బోధన పద్ధతులను, పిల్లలతో ఉపాధ్యాయుల ఇంట్రాక్షన్ ను పర్యవేక్షించారు. ఆలేరు పాఠశాలలో ఉపాధ్యాయులందరికి స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ పై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



