ఆలయ అభివృద్ధికి రూ.50 వేల 116 విరాళంగా అందజేత

– ఆలయ పూజారి వెలుకూచి వెంకటేశ్వర శర్మ
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50వేల 116 రూపాయలను కీర్తిశేషులు మద్ది ఉప్పలయ్య గౌరమ్మ జ్ఞాపకార్ధంగా మద్ది బుజ్జమ్మ వెంకటేశ్వర్లు విరాళంగా అందించినట్లు రామలింగేశ్వర స్వామి ఆలయ పూజారి వెలుకూచి వెంకటేశ్వర శర్మ వేద పండితుడు మెలకుచి చంద్రప్రకాష్ శర్మ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఆలయ అభివృద్ధికి విరాళంగా మద్ది బుజ్జమ్మ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి విరాళంగా 50, 116అందించడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం తెలుపుతున్నారని అన్నారు. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎవరైనా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని ఆలయ పూజారి తెలిపారు. ఈ ఆలయాలోకి వచ్చిన భక్తులు మొక్కుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని అనేకమంది వచ్చి మొక్కిన మొక్కలు చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి దేవాలయాల్లోకి అభివృద్ధి కోసం దాతలుగా ముందుకు రావాలని కోరుకుంటున్నారు.
Spread the love