అదైర్య పడొద్దు…ప్రభుత్వం అండగా ఉంటుంది

– శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీనుబాబు
నవతెలంగాణ మల్హర్ రావు: అదైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. కాటారం మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన నీటి వినియోగ దారుల సంఘం చేర్మెన్ చిగురు సత్తయ్య ఇటివల అనారోగ్యంతో మృతి చెందడంతో బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అదైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love