అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: జంగిడి శ్రీనివాస్

నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని భూపాలపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఎడ్ల పల్లి గ్రామపంచాయతీలో గల శభాష్ నగర్ గ్రామానికి చెందిన గుంటోజు లచ్చయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మంగళవారం ఎడ్లపల్లి కాంగ్రేస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జంగిడి సమ్మయ్య ఆధ్వర్యంలో మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, యాభై కిలోల సన్నబియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాగ్రెస్ నాయకులు జనగామ బాపు, మెరుగు శ్రీనివాస్, దుబ్బేట నగేష్, పిల్లమర్రి వెంకటస్వామి, దుబాసి రాజయ్య పాల్గొన్నారు.
Spread the love