దంతాలను సంరంక్షించు కోవాలి : డాక్టర్ శ్రీను నాయక్

నవతెలంగాణ-డిచ్ పల్లి : ప్రతి ఒక్కరూ తమ దంతాలను సంరంక్షించు కోవాలని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శ్రీను నాయక్ అన్నారు. గురువారం డిచ్ పల్లి మండలం లోని మెంట్రాజ్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీను నాయక్ డెంటల్ అసుపత్రి అధ్వర్యంలో సిబ్బంది ఉచిత దంత శిబిరం నిర్వహించారు.అనంతరం విద్యార్థుల దంతాలను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ దంతాలలో ఎమైన లోపాలుంటే వేంటనే ఆసుపత్రి కి వెళ్లి ‌దంతలను పరిక్షీంచుకోని వైద్యుల సూచనలు సలహాలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది, అద్యపాకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love