– సీపీఐ(ఎం) నాయకుల నిరసన..
నవతెలంగాణ-ధూల్పేట్
గత కొన్ని రోజులుగా పొంగిపొర్లుతున్న డ్రయినేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) సౌత్ జిల్లా నాయకులు అబ్దుల్ సత్తార్ అన్నారు. ఐయస్ సదన్, సంతోష్ నగర్ క్రీడా రోడ్డు చౌరస్తాలో పారుతున్న డ్రయి నేజీ ముందు సమస్యను పరిష్కరించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఎంతో కాలంగా డ్రయినేజీ మురుగు నీరు పొంగుతూ దుర్గంధం వెదజల్లుతుంద న్నారు. దీంతో రాక పొకలు సాగించే వారికి దుర్గంధ దుర్వాసనతో ఇబ్బం దులకు గురౌతున్నారన్నారు. అనేక సార్లు జీహెచ్ఎంసీ అధికారులను విన్నవించిన పరిష్కారించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే పరిష్కరించాలని లేనిచో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అబ్దుల్ సత్తార్, గులాం నసీర్, మహ్మద్ అన్వర్ ఖాన్, మహ్మద్ అత్హర్ తదితరులు పాల్గొన్నారు.