నవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి జగన్ నివాస ప్రాంతమైన గుంటూరు జిల్లా తాడేపల్లిలో సుమారు రూ5.28 లక్షల విలువైన మాదకద్రవ్యాలను మంగళగిరి ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. మంగళగిరి సెబ్ కార్యాలయంలో శనివారం సెబ్ డీఎస్ఈవో, అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. కుంచనపల్లి పరిధిలోని డీమార్ట్ ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డులో ముగ్గురు యువకులు డ్రగ్స్తో ఉన్నారన్న సమాచారంతో సెబ్ ఇన్స్పెక్టరు పి.ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం దాడి చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన మల్లిశెట్టి రవికిరణ్ అలియాస్ కిట్టయ్య, అమరా రఘునందన సాంబమూర్తి అలియాస్ రఘు, దట్టా దేవీప్రసాద్ శశాంక్వర్మను అదుపులోకి తీసుకుని, వారి నుంచి సుమారు రూ.5.28 లక్షల విలువైన 88 గ్రాముల మేథాంఫిటమి్స(మెథ్), బైక్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.