– 5 కిలోల కొకైన్ పట్టివేత
– నలుగురు మహిళల అరెస్ట్
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ ఎత్తున కొకైన్ పట్టుబడింది. సుమారు రూ.50కోట్ల విలువ చేసే కొకైన్ను అధికారులు పట్టుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు నలుగురు మహిళలు వచ్చారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఎయిర్పోర్టు చెక్ ఇన్ బ్యాగ్లో భాగంగా నలుగురు మహిళల హ్యాండ్ బ్యాగులను అధికారులు తనిఖీ చేసి కొకైన్ను గుర్తించారు. కొకైన్కు బ్రౌన్ కల్లర్ టేపు చుట్టుకుని రహస్యంగా తరలించడానికి మహిళలు ప్రయత్నించారు. డీఆర్ఐ అధికారులు ఐదు కిలోల కొకైన్ను పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. కొకైన్ను స్వాధీనం చేసుకుని, ఆ నలుగురు మహిళలను ఎన్డీపీఎస్ 1985 చట్టం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.