నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) సిలబస్లో ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డీఎస్సీ సిలబస్ను గురువారం విడుదల చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు సంబంధించిన సిలబస్లో మార్పులు చేశారు.
ఉపాధ్యాయ పోస్టులను పెంచాలి : రామ్మోహన్రెడ్డి
ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను పెంచాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా జిల్లాల్లో రోస్టర్వారీగా పోస్టులను చూస్తే సున్నాలున్నాయనీ, దీంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీలో కలపాలని కోరారు. డీఎస్సీ రాతపరీక్షలను నవంబర్లో కాకుండా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.