అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే

నవతెలంగాణ- మిరు దొడ్డి 
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం అక్బర్ పేట భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన బత్తుల జీవనందం  కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని చేశారు.
 బిఆర్ఎస్ నాయకుడు జీవానందం మృతి బాధాకరమన్నారు.. ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మన్ షేర్ల కైలాసం , మాజీ ఎంపిపి పంజాల శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రవి, గ్రామ పార్టీ అధ్యక్షులు పెండేల రమేష్, బిఆర్ఎస్ నాయకులు చిరంజీవి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love