- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే విదేశాలకు ప్రయాణించవద్దని తెలిపింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న తరుణంలో ఆ దేశాలకు వెళ్లాలనుకునేవారు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
- Advertisement -



