పవన్‌కల్యాణ్‌కు ఈసీ నోటీసులు..

నవతెలంగాణ – అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్‌ బుధవారం నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 6న సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి పవన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ నోటీసులు ఇచ్చింది. జగన్‌ స్కాం స్టార్‌, ల్యాండ్‌ గ్రాబర్‌, సాండ్ అండ్‌ లిక్కర్‌ ఎంపరర్‌ అంటూ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ స్పందించి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్‌కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది.

Spread the love