రూ.20కే ఎకానమీ మీల్స్‌..

– రూ.50కి స్నాక్స్‌,మీల్స్‌
– ఏడు రైల్వేస్టేషన్లలో 18 కౌంటర్లలో లభ్యం : దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దక్షిణ మధ్య రైల్వేపరిధిలో గల ఏడు రైల్వే స్టేషన్లలోని 18 కౌంటర్లలో రూ.20కి ఎకానమీ భోజనం, రూ.50కి స్నాక్స్‌మీల్‌ అందిస్తున్నామనీ, ఇది ప్రయాణీకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మం గళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫా రాలపై జనరల్‌ కోచ్‌ల వద్ద భారతీయ రైల్వేలు, ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సంయుక్తంగా తక్కువ ధరలో పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. భారతీయ రైల్వేలలో ఈ భోజన సదుపాయం ప్రస్తుతం 100కి పైగా స్టేషన్లలో 150 కౌంటర్ల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్‌, విజయ వాడ, రేణిగుంట, గుంతకల్‌, తిరుపతి, రాజమండ్రి వికారబాద్‌, పాకాల, ధోన్‌, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్‌ మొదలైన 12 రైల్వే స్టేషన్లలో, 18 కౌంటర్ల ద్వారా ఇప్పటికే ప్రయాణికులకు ఈ ఎకానమీ మీల్స్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు.

Spread the love