బీఆర్ఎస్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం

– రైతుబందు నిలిపివేయాలని కాంగ్రెస్ రాసిన లేఖపై నిరసన
నవతెలంగాణ-బెజ్జంకి :
తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న రైతుబందును నిలిపివేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖపై మండల బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగంపై కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. రైతుబందు సహయాన్ని నిలిపివేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖను ఎన్నికల కమిషన్ అధికారులు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.
Spread the love