నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
లోక సభ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీకృత కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన కంట్రోల్ రూమ్ ఇన్చార్జి అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఆమె సమీకృత కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాల తనిఖీలను సీసీటీవీ వీడియో ల ద్వారా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి వచ్చే ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి బృందాలకు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నది లేనిది పర్యవేక్షించాలని అదేవిధంగా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.