మహానీయుల జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక

నవతెలంగాణ-కోహెడ: మండల కేంద్రంలోని అంబేద్కర్‌ సంఘ భవనంలో గురువారం మండల అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో మహానీయుల జయంతి ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంబేద్కర్‌ సంఘం మండల అధ్యక్షుడు వేల్పుల జాన్‌ అధ్యక్షతన కమిటీ మండల అధ్యక్షుడిగా రాగుల శ్రీనివాస్‌, గౌరవ అధ్యక్షులుగా మంద ధర్మయ్య, మంద రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య, సలహాదారులుగా ఎత్తి పద్మయ్య, బందెల బాలకిషన్‌, వేల్పుల వెంకటస్వామి, కమీటీ సభ్యులుగా తలారి నర్సయ్య, బందెల రాజమౌళి, ఆరె జగదీష్‌, ర్యాగటి బాబు, బిట్ల మల్లేష్‌, ఎత్తి నగేష్‌, సిహెచ్‌.కిష్టస్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకుల మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మండల ప్రజలు సహాకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love