హోమ్ ఓటింగ్ ను వినియోగించుకోవాలి: ఎన్నికల అధికారి వేణుగోపాల్

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఓటింగ్ శాతం పెంచేందుకు అమలు చేస్తున్న హోమ్ ఓటింగ్ 85 సంవత్సరాలు పైబడిన వృద్దులు, వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గం ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ శనివారం నుండి ఈ నెల 6 వ తేదీ వలకు ఈ సదుపాయం ఉంటుందని తెలిపారు. నియోజక వర్గంలో 81 మంది వృద్ధులు, 91 మంది వికలాంగులు ఇంటివద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Spread the love