పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే…

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండలంలో కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల సరళిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రారం, మాసంపల్లి, తాండూర్, చీనూర్, వదలపర్తి గ్రామాలలో కొనసాగుతున్న పోలింగ్ సెంటర్ల వద్దకు చేరుకొని పోలింగ్ సరళిని పరిశీలించారు. గ్రామాలలో పోలింగ్ శాతం ఏ విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. నాగిరెడ్డి పేట మడలంలో మంచి మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ తాండూర్ సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి తోపాటు కాంగ్రెస్ నాయకులు మురళి గౌడ్, పర్వత్త్రావు, కిష్టయ్య,  నారాయణరెడ్డి, సాయి, మాజీ సర్పంచ్ బాయిని విఠల్, కో ఆప్షన్ సభ్యులు షాహిద్ పాషా, శేఖర్ సుధాకర్ తదితరులు ఉన్నారు.
Spread the love