– రక్తదాన శిబిరం నిర్వహణకు సన్నాహాలు
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజు నేపథ్యంలో ఈనెల 15న హైదరాబాద్లోని ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయంలో ఇంజినీర్స్ డే నిర్వహించనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ ఉద్యోగ సంఘాలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా రక్తదానం శిబిరం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో రెండు శాఖల ఇంజినీర్ ఇన్ చీఫ్లు ఎజీ సంజీవరావు, ఎం కృపాకర్రెడ్డి తదితరులు పాల్గొంటారని పీఆర్ సీఈ జీ సీతారాములు తెలిపారు అలాగే పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానీయాను ఆహ్వానించనున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.